సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు:- ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు,జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి, సామాజిక కార్యకర్త గౌస్ లాజమ్ విద్యార్థులకు సూచించారు. వేసవి సెలవులు రాగానే విద్యార్థులు పుస్తకాలను పక్కనపెట్టి మిత్రులతో కాలక్షేపం చేయడం చేస్తుంటారని ఇది ఎంత మాత్రం సరైనది కాదని అన్నారు. వేసవి సెలవులు సెలవుల సందర్భంగా ప్రతి విద్యార్థి పై చదువులకు సంబంధించిన పుస్తకాలను తీసుకొని శ్రద్ధగా చదువుకోవాలని, అదేవిధంగా వార్షిక పరీక్షలు ముగిసినందున పిల్లలు విద్యార్థులు వేసవి సెలవుల్లో గ్రామ శివారులో ఉన్న చెరువులకు కుంటలకు బావులకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈత కోసం చెరువుల వద్దకు వెళ్ళు వద్దకు వెళ్ళవద్దని సూచించారు. ప్రమాదాల బారినపడి కన్నవారికి శోకం మిగిల్చిన వద్దని హితవు పలికారు. అంతేకాకుండా దృఢత్వం స్నేహబంధాలు పెంపొందించుతాయని పెంపొందుతాయని తెలిపారు క్రీడల్లో మంచి శిక్షణ తీసుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్థాయి క్రీడల్లో పాల్గొంటే క్రీడల కోట కింద ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలు ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు ప్రతి విద్యార్థి కూడా వేసవి సెలవులు నిర్లక్ష్యంగా వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు....
-----------------------
Admin