సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం మున్సిపల్ సిపిఐ పక్ష కౌన్సిలర్ల అభిప్రాయంపై చర్చించి సామరస్యంగా పరిష్కరించుకుంటామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా తెలిపారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ నందు గురువారం అయన మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నాయకత్వంలో భద్రాద్రి జిల్లాలో, కొత్తగూడెం నియోజకవర్గంలో ఐక్యంగా నిబద్దతతో పనిచేస్తున్నామని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కూనంనేని సాంబశివరావును వచ్చే ఎన్నికల్లో గెలిపించుకోవాలని ఇటీవల జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో నిర్ణయించుకొని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో నిమగ్నమయ్యాయని తెలిపారు. జిల్లా కార్యవర్గ నిర్ణయంపై కొత్తగూడెం మున్సిపల్ సిపిఐ పక్ష కౌన్సిలర్లు మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని బహిర్గతం చేశారని, ఈ అంశాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అది పార్టీ ఆంతర్గత విషయమని తెలిపారు. అయినప్పటికీ ఐక్యంగా కూనంనేని గెలుపుకోసం అందరం కలిసి పనిచేస్తామని సాబీర్ పాషా తెలిపారు.
-----------------------
Admin