సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో లక్ష్మీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. విజిలెన్స్ వ్యవసాయ శాఖ సిఐ వెంకటరమణ, విజిలెన్స్ వ్యవసాయ శాఖ అధికారి వాసు ప్రకాష్ , మండల వ్యవసాయ అధికారి ఇలియాస్ మహమ్మద్ , గ్రామ రెవెన్యూ అధికారి శ్రీలత వారి ఆధ్వర్యంలో ఎరువుల దుకాణం కి సీజ్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ యజమాని విజిలెన్స్ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకున్న వెంటనే షాప్ మూసివేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో విజిలెన్స్ అధికారులు ఆ దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుకాణంలో అన్ని సక్రమంగా జరుగుతున్నప్పుడు అధికారులను చూసి యజమాని ఎందుకు షాపు మూసివేశారని మేము వచ్చాము అన్న విషయం తెలిసి ఈ విధంగా చేయడం చూస్తుంటే ఇందులో నకిలీ పురుగు మందులు విత్తనాలు అమ్ముతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దుకాణదారుడు షాప్ తెరవాలంటే స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారి వీఆర్వోల సమక్షంలోని తెరవాల్సి ఉంటుందని తెలిపారు. మండలంలో ఎక్కడైనా నకిలీ మందులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
-----------------------
Admin