సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలో తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరయ్యారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం నందిగామ మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమన్ని గ్రామ సర్పంచ్ జిల్లెల వెంకటరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, అద్యక్షనతో మండల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులను, విద్యుత్ అధికారులను, ఆశ వర్కర్ లను శాలువాలతో సత్కరించి అవార్డులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం యజ్ఞంలా సాగి, గ్రామాల రూపు రేఖల్ని మార్చేసిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా నిధుల వరద పారగా, నాలుగేళ్ల కాలంలో అభివృద్ధి పరవళ్లు తొక్కింది. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, చెత్త సేకరణకు ట్రాక్టర్, ట్రాలీ, హరితహారం కోసం ట్యాంకర్, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, డంప్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లతో శోభాయమానంగా విలసిల్లుతున్నాయి. గ్రామం లో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు దర్శనమిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా సర్పంచ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ... వివిధ గ్రామాలకు బీటీ రోడ్డులు, సిసి రోడ్లు, అండర్ డ్రైనేజ్, పారిశుద్ధ్యం, విధి లైట్స్ తదితర పనులు పూర్తయ్యాయని, గ్రామం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని, గ్రామలే దేశానికి పట్టు కొమ్ములని అవి అభివృద్ది చెందితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin