సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫరూక్ నగర్ మండలం : గ్రామాల్లో అందరూ కలిసికట్టుగా ఐక్యంగా వ్యవహరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని విడిపోతే చెడిపోతామని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయగుట్ట తాండ గ్రామపంచాయతీలోని దాదాపుగా 30 మంది బిజెపి తదితర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ డాక్టర్ రవి నాయక్, తాలూకా చైర్మెన్ శీను నాయక్ ఆధ్వర్యంలో చేరడం జరిగింది. అందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి విజయం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు జగన్ నాయక్, ఏ రాజు నాయక్, శ్రీను నాయక్, నవీన్ నాయక్, దసరా బుల్లెట్ శ్రీను, రవి నాయక్, రమేష్ నాయక్, రామ్ నాయక్, శ్రీకాంత్ నాయక్, మోహన్ నాయక్, నరసింహ, దశరథ్, గోపాల్, రవి, హనుమంతు, మంగ్యా గ్రూప్ల శ్రీకాంత్, నరేష్, వెంకటేష్, నరేష్ బాబు, హనుమంతు తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ నాయక్, తాలూకా ఉపాధ్యక్షుడు రమేష్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ నాయక్, సంజు నాయక్, గణేష్ నాయక్, నరేష్ నాయక్, శంకర్ నాయక్, లచ్చు నాయక్, రామ్ దాస్ నాయక్, శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin