సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని కార్యాలయం నందు గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఓటుకు నమోదుకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.చాలామంది పట్టబద్రులు గతంలో ఓటు నమోదు చేసుకున్న మళ్లీ ఓటు నమోదు చేసుకోనవసరం లేదు అనే అనుకుంటారు కానీ పట్టభద్రులు ఎన్నికలకు సంబంధించి కొత్తగానే అప్లై చేసుకోవాలి ఇంతకుముందు అప్లై చేసుకున్నప్పటికి మళ్లీ ఫ్రెష్ గానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టభద్రుల నియోజకవర్గానికి నమోదు చేసుకునే అభ్యర్థులు 1 నవంబర్ 2020 నాటికి డిగ్రీ పాసైన వారు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవడానికి అర్హులు. గతంలో అప్లై చేసుకున్న వాళ్లు కూడా మళ్లీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 6వ తేదీ నాటికి అప్లై చేసుకున్న వారి వివరాలు డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయబడతాయి. అయితే మార్చి 14వ తారీకు వరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు కోసం ఆన్లైన్లో కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు దీనికోసం మీ యొక్క డిగ్రీ మెమో గెజిటెడ్ అధికారి చే ధ్రువీకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లయితే మళ్లీ మీరు సంబంధిత తాసిల్దార్ కార్యాలయానికి వెళ్ళనవసరం లేదు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగార్జున రెడ్డి ఉప తాసిల్దార్ కమలాకర్, చిలక కిషోర్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కె నరసింహారావు బీఎస్పీ పార్టీ వై నరసింహారావు టిఆర్ఎస్ పార్టీ పాల్గొన్నారు.
-----------------------
Admin