సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో గ్రామ దళితుల ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు తీసుకువచ్చారని అందుకు కృతజ్ఞతగా సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించడం అభినందనీయమని సీఎం కెసిఆర్ దళిత సమాజం ఆర్థికంగా బలోపేతం కావాలని దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బందు తీసుకువచ్చిన సీఎం కెసిఆర్ కు అండగా ఉండాలని ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మకూడదు అని, ప్రతిపక్ష పార్టీలు దళిత బందు మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మవద్దని దళిత బంధు దశలవారీగా వస్తుందని గొల్ల కురుమలకు అందజేస్తున్న గొర్రెల పంపిణీ విడతల వారీగా రావడం మనం చూస్తున్నామని దళిత బందు కూడా విడతల వారీగా రావడం జరుగుతుందని నిరంతర ప్రక్రియ దళిత బందు అని అన్నారు దళిత బంధు తో దళితులు ఆర్థికంగా నిలదొక్కు కోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాజు, గడ్డమీది యాదగిరి,రవీందర్, ఎర్రోళ్ల జ్యోతి చంద్రయ్య, తుమ్మ భాస్కర్,నరేష్,మల్లేష్,వెంకటయ్య,కనకరాజు,కుమార్, మధు,శ్రీను,అశోక్,స్వామి,బాబు, చందు,ప్రవీణ్,యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin