Thursday, 30 July 2026 02:41:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నామినేషన్ ప్రక్రియ కు అన్ని ఏర్పాట్లు పూర్తి...

Date : 03 November 2023 07:45 AM Views : 202

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని తాహాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో నాగార్జున రెడ్డి, ఆర్డీవో జగన్మోహన్ రెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు నవంబర్ 3 వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయం (తహాసిల్ ఆఫీస్ హుజూర్ నగర్) లో అన్ని పని దినాలలో స్వీకరిస్తారు. నామినేషన్లు మరియు ఫారం -26 అఫిడవిట్ నేరుగా దరఖాస్తు పూర్తి చేసి గాని లేదా ఆన్లైన్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్ లో పూర్తి చేసిన నామినేషన్ మరియు ఫారం -26 అఫిడవిట్ ను ప్రింట్ చేసి పోటీ చేయాలనుకున్న అభ్యర్థి గాని అతని ప్రతిపాదకుడు గాని రిటర్నింగ్ అధికారికి కార్యాలయంలో సమర్పించాలి. లేదా ఆన్లైన్ లో నామినేషన్, ఫారం -26 అఫిడవిట్ దరఖాస్తు చేసుకోవడానికి భారత ఎన్నికల సంఘం వారి సువిధ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఫారం -26 అఫిడవిట్ దరఖాస్తు పాముని నామినేషన్ వేసే అభ్యర్థి పూర్తిగా నింపాలి నామినేషన్ కి వచ్చే అభ్యర్థుల వాహనాలు మూడు వాహనాలకు మాత్రమే పర్మిషన్ అదేవిధంగా అభ్యర్థి అతని వెంట ముగ్గురు మాత్రమే నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి పర్మిషన్ అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ గా ఓసి అయితే ఎస్ సి, ఎస్ టి లు అయితే 5.000 రూపాయలు చేయాల్సి ఉంటుంది నేషనల్ పార్టీలు గుర్తులు ఒకరు వేసిన సరిపోతుంది అదే స్వతంత్ర అభ్యర్థులు అయితే వారు వారి వెంట వచ్చే ఒకరిద్దరు సంతకం పెట్టాల్సి ఉంటుంది గుర్తింపు పొందిన పార్టీ గుర్తు నామినేషన్ చివరి రోజు వరకు ఇస్తేనే లెక్కలోకి వస్తుంది నామినేషన్ వేసే అభ్యర్థి బ్యాంకు ఖాతా కొత్తది ఎన్నికలకు సంబంధించి తీయాల్సి వస్తుంది ఎన్నికలకు సంబంధించి ఏ లావా దేవీలైన ఈ ఖాతా నుండి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది చివరి రోజు అభ్యర్థి తప్పకుండా ప్రతిజ్ఞ రిటర్నింగ్ అధికారి ముందుగానీ మెడిస్టేట్ ముందుగానీ తప్పకుండా చదవాల్సి ఉంటుంది నామినేషన్ రోజు నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థి నేర చరిత్ర సంబంధించి వివరాలు మూడు నాలుగు రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది ఈ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు 40లక్షల వరకు అనుమతులు ఇవ్వబడునవి అలాగే ప్రతి మండలంలో ఎంపీడీవో లకు ఎన్నికలకు సంబంధించి సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు హుజూర్ నగర్, నేరేడుచర్ల ఈ రెండు మండలాల్లో కమిషనర్ పర్యవేక్షణ అలాగే అంతరాష్ట్ర చెక్పోస్టు లకు ఏడు చెక్పోస్టుల భద్రత పెంచడం పర్యవేక్షించడం జరుగుతుంది అన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :