సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లోఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జయంతోత్సవాల సందర్భంగా మంగళవారం పుట్టపర్తి పట్టణంలోని ఆర్.వి.జానకి రామయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల నందు ఉచిత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఆయుష్ కమిషనర్ వి.రాములు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య శిబిరంలో ఉత్తమ వైద్య సేవలు అందించాలన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 97వ జయంతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్యం అనేది ఉత్తమ ఫలితాలు అందిస్తుందన్నారు. వివిధ రకాల వ్యాధుల నివారణలో హోమియోపతి మందులు, వైద్యం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. వైరల్ జ్వరాలు, జలుబు, అలర్జీ లు, చిన్న చిన్న గాయాలు, తలనొప్పి, పులిపిరి కాయలు, నల్ల మచ్చలు, పోడలు వంటి శారీరక సమస్యలు, కండరాలు నొప్పులు వంటి వాటికి హోమియోపతి సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ఎస్.వి.కృష్ణారెడ్డి, ఆయుష్ అర్డిడి డా.కె.వి. కుమార్ బాబు, కడప హోమియో హాస్పిటల్ సూపరింటెండెంట్ బి. ఆనందరావ్, ఆయుష్ డాక్టర్ లు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు....
-----------------------
Admin