సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : వేలేరు మండల కేంద్రంలో హనుమాన్ స్వాములకు భీక్షా కార్యఁకమాన్ని ఏర్పాటు చేసిన వేలేరు ఉప సర్పంచ్ దంపతులు సులోచన, సద్దాం హుస్సేన్.... ఈరోజు వేలేరు మండల కేంద్రంలోని రుద్ర రామేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా దాదాపు 60 మంది స్వాములకు భీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం సద్దాం హుస్సేన్ గారు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం పరమత సహనమే అన్ని మతాల పరమావదిగ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని నమ్మి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు అలాగే గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని ఆ దేవుడిని ఆశీస్సులు ఎల్లవేళలా మాపై ఉండాలని వేడుకున్నట్లు వారు తెలిపారు కార్యఁకమంలో యువకులు సలీంమాలిక్, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు....
-----------------------
Admin