సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం : నీళ్లు నియామకాలు నిధులు అనే నినాదంతో ప్రజలను మభ్యపెట్టి వ్యవసాయ తెలంగాణ అని ప్రగల్బాలు పలికి దొరగారు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నియామకాలు మాట దేవుడెరుగు . కానీ వ్యవసాయం కోసం నీరు అందించలేకపోయారు . వ్యవసాయం కోసం కొన్ని కోట్లు ఖర్చుపెట్టి వెంకటాపురం మండలలో కట్టించిన పాలెం ప్రాజెక్ట్ సమయానికి రైతులకు ఉపయోగం లేకుండా పోయింది . గత కొన్ని నెలలుగా వెంకటాపురం మండలం నూగురు గ్రామంలో సాగునీళ్లు అందక ప్రాజెక్టు నీరు చెరువులకు చేరక చెరువు ఆయకట్టు క్రింద ఉన్న వేల ఎకరాల పంట పొలాలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. అని రైతులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న పంట పొలాలకు తప్పనిసరిగా నీరు అందించాల్సిన అవసరం ఉంటుందనీ ఈ సమయంలో నీరు పెట్టకపోతే పంట మొత్తం ఎండిపోయి భూమి బిటలు వారే పరిస్థితులు ఉంటాయని రైతులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నీరు లేక నెల రోజులు దాటిందని పాలెం ప్రాజెక్టు సుమారు 1250 టీఎంసీల నీటి నిలువ చేసే సామర్థ్యం ఉంటుందని ఇప్పుడు కనీసం 680 ఎం సి ఎఫ్ టి అయినా నీళ్లు ఉంటాయని ఈ నీలైన సక్రమంగా చెరువులకు పంపిస్తే పంటలు మళ్లీ చిగురించే అవకాశం ఉందని రైతులు పేర్కొన్నారు. ఈ విషయం పట్ల ఏ అధికారిని అడిగిన స్పందించట్లేదని మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేడంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. నోటిదాక వచ్చిన పంట చేజారి పోతుంటే చూస్తూ ఉండి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, చివర పొట్ట దశలోనైనా సక్రమంగా నీళ్లు అందిస్తే కష్టపడైనా పంటను నిలుపుకొని పెట్టుబడి మందమైనా అప్పులు లేకుండా ఉంటామని రైతులు పత్రిక ముఖంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కుడికాలువకు ఎడమ కాలువకు పడ్డ గండీలు తక్షణమే పూడ్చి నుగురు చెరువు నింపే ప్రయత్నం చేయాలని ఆ గండిపడడం వల్ల నీరు వృధాగా మారి గోదావరిలోకి వాగుల్లోకి పోతున్నాయని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గండి పూడ్చడం వల్ల వచ్చే నీరు డైరెక్ట్ గా చెరువులోనే పడతాయని తద్వారా పంటలకు నీరు అందుతాయని. వారు తెలిపారు. ఇకనైనా ఉన్నత అధికారులు ఈ విషయం పట్ల రైతులకు సహకరించి అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవాలని వారు కోరారు. ప్రాజెక్టు ఎడమ కాలువ కుడి కాలువ మరమ్మత్తుల విషయమై. ఏఈ వివరణ : ఏఈ ని అడగగా తాము పై అధికారులకు చెప్పిన వాళ్ళు రావట్లేదని తమ చేతుల్లో ఏమీ లేదని . కాలువల మరమ్మత్తు పనులకు మనుషులని పంపిస్తామని ఎప్పటినుండో చెప్తున్నారని కానీ ఇంతవరకు పంపించలేదని ఏఈ తెలిపారు.
-----------------------
Admin