Monday, 14 September 2026 08:04:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి...

Date : 12 January 2023 12:34 AM Views : 888

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ప్రజలకు నాణ్యమైన, సత్వర సేవలు ఒకే దగ్గర అందించాలని, పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో మిగులు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంకా చేపట్టాల్సిన పనులు వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. పనులను మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందని ఆదేశించారు. మిగులు చిన్న చిన్న పనులు, విద్యుత్ ఇతర చేపడుతున్న పనులు సమాంతరంగా చేపట్టాలని ఆయన అన్నారు. పనుల్లో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి, విద్యుత్, మునిసిపల్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :