Friday, 08 May 2026 11:29:46 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బూర్గంపహడ్ లో న్యాయ అవగాహన సదస్సు...

Date : 07 January 2023 11:44 PM Views : 505

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం, సారపాక గ్రామపంచాయతీ పరిధిలోగల చంద్రయ్య గుంపు నందు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నీలిమ ముఖ్య అతిథిగా విచ్చేశారు, సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ న్యాయ అవగాహన కలిగి ఉండాలని, గిరిజన వాసులైన మీరందరూ పోడు భూములపైన, అటవీ చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏపీపీ దుర్గాబాయి మాట్లాడుతూ గిరిజనులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం వారు మీకు సహాయ సహకారాలు అందిస్తారని, దొంగతనాలు లైంగిక హత్యలు జరిగితే పోలీస్ వారిని సంప్రదించవచ్చని గిరిజనులకు తెలియజేశారు అదేవిధంగా న్యాయ అవగాహన సదస్సులో సీనియర్ న్యాయవాది ముత్యాల కిషోర్ చట్టాల పైన అవగాహన కలిగించారు. నిప్పు పట్టుకుంటే కాలుతుంది అనేది ఎంత నిజమో, చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా పనిచేస్తే.. చట్టం మనల్ని శిక్షిస్తుంది అని గిరిజనులకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. అదేవిధంగా న్యాయవాది తిరుమల రావు గిరిజనుల ఉద్దేశించి సుమారు 5 , 6 చట్టాల గురించి అవగాహన కల్పించారు , దాట్ల సంధ్య, రమాదేవి , జగదీష్ అడ్వకేట్లు సభను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ కుమార్ గిరిజనులతో ఎంతో ఐకమత్యంగా ఉంటూ, వారి కష్టా, నష్టాలు, బాగోగులు, అన్ని తెలుసుకొని వారికి ఎమ్మార్వో , ఎంపీడీవో ద్వారా కలెక్టర్ కు తెలియజేసి రోడ్లు, కరెంటు ఏర్పాటు చేపిస్తామని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో తాసిల్దార్ భగవాన్ రెడ్డి , ఎంపీడివో గిరిజన పెద్దలైన నరేందర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :