సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండలంలోని మామిళ్ళ కుంట్లపల్లిలో గురువారం మార్గశిర మాసం పౌర్ణమి సందర్బంగా శ్రీ మణికంఠ అయ్యప్పస్వామి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారని అయ్యప్పస్వామి మాలధారణ భక్తులు తెలిపారు. ముందుగా గ్రామ రామాలయంలో అయ్యప్పస్వామికి పురోహితుడు వినాయకస్వామికి అర్చన పూజలు నిర్వహించగా, ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులునాయుడు అయ్యప్పస్వామికి అభిషేకలు, ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ మాలధారణ సమక్షంలో కర్పూరం నీరాజనాలు సమర్పించి, తీర్థప్రసాదాలు అందించారు.తదుపరి వివిధ రకాల పుష్పలతో ప్రత్యేకంగా అలంకరణ చేసిన పల్లకిలో అయ్యప్పస్వామివారికి పూజలు నిర్వహించి భక్తుల దర్శనార్థం పురవీధుల్లో ఊరేగింపు చేపట్టి, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన వందలాది మంది అయ్యప్పస్వామి మాలధారణ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు....
-----------------------
Admin