సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం పట్టణంలో, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర భద్రాచలం పట్టణం పాత మార్కెట్ మహాత్మ గాంధీ కూడలి నుండి అంబేద్కర్ కూడలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు పదయత్ర చేయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పొదెం వీరయ్య గారు, భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావుగారు మరియు తెలంగాణ రాష్ట్ర పీసీసీ జనరల్ సెక్రెటరీ మరియు భద్రాచల నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ ప్రమోద్ గారు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం వీరయ్య గారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని సార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటనను అంతస్తులును అవకాశాల్లోనూ మానవత్వాన్ని కల్పించడానికి కులమాత ప్రాంత వర్మ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగ కల్పించిందని. ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తూ సమాజంలో అసాధ్యులే నెలకొల్పుతున్నాయని విభేదాలు సృష్టిస్తూ రాజకీయం మనగాడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్నారు ఇలాంటి తరుణంలో శాంతి అహింసను మూల సూత్రాలుగా మనకు బోధించే మహాత్ముడి స్ఫూర్తిగా మనసులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించడానికి డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలను అమలు చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకితభావంతో అహర్నిశలు కృషి చేయాలన్నారు. రాజ్యాంగాన్ని రచించింది కాంగ్రెస్ పార్టీ అని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రాజ్యాంగాన్ని పరిరక్షించేది కూడా కాంగ్రెస్ పార్టీ యేనన్నారు అలాంటి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జై బాపు జై భీమ్ జై సమ్మిదాన కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. Dr. తెల్లం వెంకట్రావు గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి గ్రామంలో ర్యాలీ నిర్వహించాలన్నారు. టీపీసీసీ సెక్రటరీ ప్రమోద్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేపట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో.....
-----------------------
Admin