సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు, ప్రతీ నెలా జరిగే PMSMA (ప్రధానమంత్రి సురక్షా మాతృత్వ అభియాన్) లో భాగంగా ఈరోజు హై రిస్క్ గర్భవతులకు ప్రత్యేక పరీక్షలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు డాక్టర్ మున్వర్ బాషా గారు 62 మంది గర్భవతులను పరీక్షించడం జరిగింది. అందులో 17 మంది రక్త హీనత ఉన్న గర్భవతులను గుర్తించి, ఐరన్ సుక్రోజ్ ఇంజక్షన్స్ ఇవ్వడం జరిగింది. 16 మందిని ఉచిత అల్ట్రా సౌండ్ స్కానింగ్ కొరకు కదిరికి పంపడం జరిగింది. వచ్చిన గర్భవతులకు, ప్రసవ సమయం వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు వైద్యాధికారి గారు తెలియచేయడం జరిగింది. అంతే కాక పుట్టపర్తి నందు ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి గంగిశెట్టి గారు, శ్రీ సత్య సాయి బాబా గారిని ఆదర్శనంగా తీసుకొని, మానవ సేవే మాధవ సేవగా భావించి, ప్రతీ నెలా PMSMA ప్రోగ్రాంకు మారు మూల ప్రాంతాలనుండి వచ్చు గర్భవతులు మరియు వారితోపాటు వచ్చు వారికి, మరియు ఆరోజు వైద్యం కోసం వచ్చిన రోగులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనిన వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు అందరికి ఉచిత పౌష్టికాహారంను అందచేస్తున్నరు. ఈ కార్యక్రమం లో భాగంగా ఈరోజు మొత్తం 225 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు విశేషంగా అన్నదాత గంగిశెట్టి అన్నగారి పుట్టినరోజు కావడం విశేషం. వైద్య సిబ్బంది మరియు ఆసుపత్రికి వచ్చిన గర్భవతులు గంగిశెట్టి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ధన్యవాదాలు తెలియచేశారు.
-----------------------
Admin