సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని ఎస్టియు భవన్ లో జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఆర్ సి కమిటీని వెంటనే నియమించి తక్షణమే 30 శాతం ఇంటీరియర్ రిలీఫ్ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లు లేకపోవడం వల్ల పాఠశాలలు అపరిశుభ్రతతో కొట్టుమిట్టాడుతున్నాయని వీలైనంత త్వరలో స్కావెంజర్ నియామకం చేపట్టాలని, బదిలీలు ప్రమోషన్లకై ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని, డి ఏ బకాయిలు, పిఆర్సి ఏరియాస్ ను విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దుచేసి, ఓపిఎస్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు... అనేక సంవత్సరాలుగా అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై అన్ని సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని , లేకపోతే ఉపాధ్యాయ సంఘాల్లో ఉన్న అనైక్యతను ఆసరాగా చేసుకుని ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ 18 వ తారీఖు నాడు సిపిఎస్ రద్దు కోసం జరిగే సంకల్ప రధ యాత్ర లో ఎస్ టి యు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ మండలాల ఎస్టియు బాధ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు వి యతిపతిరావు, రూప్ల నాయక్, చందూలాల్ నందిపాటి సైదులు, బూర వెంకటేశ్వర్లు, కే శివయ్య, కే వెంకయ్య, పాలూరి అంజయ్య, ఎస్ బిక్షం, గోవింద నాయక్, టి వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, ఓరుగంటి నాగేశ్వరరావు, గోవిందు, పి ఎల్లయ్య, పుల్లయ్య, సాముల.వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin