సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలోని MLA క్యాంపు కార్యాలయంలో NH-342 పై సమీక్ష సమావేశం నిర్వహిచిన పుట్టపర్తి MLA శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. NH-342 బుక్కపట్నం-కొడూరు 47కి.మీ నాలుగు వరుసల రహదారికి సంబందించి ₹1380 కోట్లకు ప్రతిపాదనలు సిద్దం చేసి పంపినామని వాటిని త్వరగా అమోదం పొందేలా చూడాలని కోరారు. ఈ నాలుగు లైన్ల రహదారికి సంబందించి యూటిలిటి షిప్టింగ్ కు ఎలక్ట్రికల్,RWS,సత్యసాయి వాటర్ సప్లై పలు శాఖలు సమన్వయం చేసుకొని అంచనాలను త్వరగా సిద్దం చేసి పంపాలని కోరారు.ఈ నాలుగు లైన్ల రహదారికి సంబందించి టెండర్లు త్వరగా పిలిచి,పనులు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో NH EE మధుసూదన్,ట్రాన్స్కో SE అనంద్,ట్రాన్స్కో EE సంజప్ప,APSPDCL EE కదిరి మోజెస్,EE హిందూపురం భూపతి,RWS ఇక్బాల్,పలు శాఖల AEలు,ఇతర ఆధికారులు పాల్గొన్నారు.
-----------------------
Admin