సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ కాలనీ లో రూ.43.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం కలసి కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆదిత్య నగర్ కాలనీ సిసి రొడ్డు నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందని, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. అదే విదంగా సిసి రోడ్డు పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, జిహెచ్ఎంసి అధికారులకు, కాంట్రాక్టర్కు తగు సూచనలు నార్నె శ్రీనివాసరావు చేశారు . ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏ ఈ సుభాష్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాంట్రాక్టర్ బాబురావు, హైదర్ నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, రాజుసాగర్, కాలనీ వాసులు వెంకట రెడ్డి, సుబ్బారావు, మోహనరావు, రాంప్రసాద్, సదాశివ, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin