సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సమర్థమైన నాయకత్వంపై విశ్వాసంతో బీజేపీ పార్టీలో చేరికలు రాణా ప్రతాప్ రెడ్డి సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట నియోజకవర్గం,నర్సంపేట పట్టణం,ముత్తోజిపేటకి చెందిన యువకులు సామల శ్రవణ్,ముత్తినేని అనిల్,ముత్తినేని అఖిల్,రేఖ రాజేష్,చెన్నబోయిన సాత్విక్,సామల శివమణి,పున్నం రాజు,ముత్తినేని సిద్దు,బొంత రాకేష్ ,జిల్లా కౌన్సిల్ మెంబర్ గంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ,పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన *బీజేపీ వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ..నర్సంపేట నియోజకవర్గంలో సమర్థమైన నాయకత్వంపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో ప్రత్యామ్నయం అని ప్రజలు గ్రహించి బీజేపీ పార్టీలో చేరుతున్నారన్నారు. గతంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు అమలు కానీ హామీలు ఇచ్చి మోసం చేస్తున్నా రెండు పార్టీలకు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు కందికొండ శ్రీనివాస్,సూత్రపు సరిత,ఉపాధ్యక్షులు ఠాకూర్ విజయ్ సింగ్,కాసుల నాగేంద్ర బాబు ,బూత్ అధ్యక్షులు తాళ్లపెల్లి రవీందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter