సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : AITUC జిల్లా మహాసభలకు ముస్తాబైన మల్లేపల్లి ఏఐటీయూసీ జిల్లా మహాసభలు ఆదివారం కొండమల్లేపల్లి జరుగుతున్న సందర్భంగా కొండమల్లేపల్లి పట్టణం జెండాలు తోరణాలతో అలంకరించడం జరిగింది. జిల్లావ్యాప్తంగా కార్మికులు ఏ జిల్లా మహాసభలో పాల్గొంటున్నారు జిల్లా మహాసభలు ఏర్పాట్లను AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పర్యవేక్షించారు. జిల్లాలో కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభలో చర్చించి భవిశ్యత్త్ పోరాట కార్యక్రమాలను రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగాAITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ ,సీనియర్ నాయకులు వి రత్నాకర్ రావు గారు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నునే వెంకటేశ్వర్లు ,రామస్వామి సిపిఐ మండల కార్యదర్శి జి వెంకటేశ్వర్ రెడ్డి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల ఆంజనేయులు AITUC నాయకులు జే వెంకట్ రాములు, ఏ మల్లయ్య,హమాలి యూనియన్ నాయకులు వెంకటయ్య, సోమ్లా, శంకర్,ఎల్లయ్య,పత్య, నందు,వెంకటయ్య,,సైదులు,చందు,శ్రీను, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin