Tuesday, 15 September 2026 08:59:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గజ్వేల్ నియోజకవర్గంలో ప్రారంభమైన యువ పోరాట యాత్ర... యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అందే మోహన్

Date : 06 July 2023 07:04 AM Views : 441

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు చెల్లించాల్సిన బకాయిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యువ పోరాట యాత్ర అధికార పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తిస్తుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అందే మోహన్ అన్నారు. రాష్ట్రంలో బుధవారం నుంచి యువజన కాంగ్రెస్ యువ పోరాట యాత్ర చేపట్టిందని మోహన్ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌ నుంచి దీనిని ప్రారంభించామని, మొత్తం 33 జిల్లాల్లో 33 రోజుల పాటు నిర్వహించనున్నట్టు అందే మోహన్ తెలిపారు. జాతీయ అధ్యక్షుడు దేవి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ పిసిసి సభ్యులు పొన్నాల లక్ష్మయ్య గజ్వేల్ డీసీసీ అధ్యక్షులు నారాయణ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యువత నిరుద్యోగులు పెద్ద ఎత్తున గజ్వేల్ తరలివచ్చారని ఆయన పేర్కొన్నారు. అదే మోహన్ మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైందని అన్నారు. ఇటీవలి సంఘటనలతో టీఎస్పీఎస్సీ తన పవిత్రతను కోల్పోయిందని, ఉపాధి లేకుండా యువత ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతిని అందించడంలో విఫలమైందనీ. దాని బకాయి రూ. ఒక్కో నిరుద్యోగికి 1.6 లక్షలు బకాయి కి చేరిందని అన్నారు. న్యాయం కోసం జరిగే పోరాటంలో మాతో చేతులు కలపాలని యువతను కోరుతున్నాం అని అందే మోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో తరుణ్ గౌడ్, రామకృష్ణ రెడ్డి, చంద్ర కాంత రెడ్డి, షాద్ నగర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఖదీర్, సోలిపూర్ రాజేష్ గౌడ్, నరేందర్, సాయి, వంశీ, సోలిపూర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :