సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణం శ్రీనగర్ కాలనీలోని 19వ వార్డు లోగల రైతు బజార్ నందు ప్రజా పరిపాలన దరఖాస్తుల సేకరణలో భాగంగా హుజూర్ నగర్ మైనార్టీ నియోజకవర్గ ప్రెసిడెంట్ షేక్ సైదా గౌడ సొసైటీ ప్రెసిడెంట్ వల్లపుదాసు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సూచనలు చేస్తూ ప్రజా పరిపాల గురించి వారు మాట్లాడుతూ భారీ నీటిపారుదల శాఖ మాత్యులు నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులు ఎవరైనా దళారులని పైరవీకారులను నమ్మకుండా ప్రజా పరిపాలనలో ప్రజల వద్దకే పాలన లాగా అధికారులతో వెరిఫికేషన్ చేయించి నిజమైన పేద అర్హులకు రేషన్ కార్డులతో పాటు గృహ జ్యోతి కింద 200 యూనిట్ల కరెంటు గృహలక్ష్మి పథకం ఇందిరమ్మ ఇండ్లకు సహాయంగా ఐదు లక్షల ను మరియు ఆరోగ్యశ్రీ ని 10 లక్షల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంజూరు చేస్తారని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన ఏ ఒక్క వర్గానికి అవకాశవాద రాజకీయ నాయకులకు కాంగ్రెస్ పార్టీలో చోటు లేదన్నారు పార్టీ గెలవగానే పైరవులు చేసే సొంత అవసరాల కోసం వచ్చే నాయకులను తరిమి కొడతామన్నారు 19వ వార్డు నందు ఏ ఒక్క నిరుపేదల కు అన్యాయం జరగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పథకం లబ్ధిదారుల తో పాటు విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే స్కూటీ లను కూడా ఇచ్చే విధంగా పారదర్శకంగా పనిచేస్తామని తెలియజేశారు. రాజీవ్ వికాస్ లో భాగంగా విద్యార్థులకు ఐదు లక్షల లోన్ సహాయం కూడా త్వరలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తుందని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ నాగేశ్వరరావు, రషీద్, మొయినుద్దీన్, వల్లపు దాసు సాయన్న, శ్రీను ,కౌసర్, మహమ్మద్, బాబురావు ,దారా, యూసఫ్, విజయలక్ష్మి, సుశీల, సరళ, బూర నారాయణమ్మ ,మారగాని నాగమ్మ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin