సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్, రూరల్ మేజర్ న్యూస్: మక్తల్ మండల కేంద్రంలోని కిరాణా అసోసియేషన్ భవనంలో వైద్య విజ్ఞాన సదస్సును తాలూకా గ్రామీణ వైద్య సేవకుల సంఘం అధ్యక్షులు రూమళ్ళ సిద్రామేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వైద్య విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా మహబూబ్నగర్ ఆర్.యం.పి, పి.యం.పి, జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్, మహబూబ్ నగర్ సాన్వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వాసు చైతన్య, హాజరై వారు మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్.యం.పీ, పీ.యం.పీ వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు ప్రథమ చికిత్స మాత్రమే చేసి, రోగి పరిస్థితిని బట్టి మెరుగైన వైద్యం కోసం నిపుణులైన వైద్యుల వద్దకు రెఫర్ చేయాలని అన్నారు. తాలూకా గ్రామీణ వైద్య సేవకుల సంఘం అధ్యక్షులు రూమళ్ళ సిద్రామేశ్వర్, మాట్లాడుతూ గ్రామాల్లో పేద ప్రజలకు ఆర్.యం.పీ, పీ.యం.పీలు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని విశిష్ట సేవలు అందిస్తున్న ఆర్.యం.పీ లను ప్రభుత్వం గుర్తించి తక్షణమే వాళ్లకు శిక్షణ ఇచ్చి ఫస్ట్ యాడ్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు 50ఏళ్లు దాటిన ఆర్.యం.పీ,లకు పెన్షన్ సదుపాయం కల్పించాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలను అందించరాదన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్, డాక్టర్: వాసు చైతన్య,తో పాటు హాస్పిటల్ పిఆర్ఓ యం.అరుణ్ కుమార్,ను ఆర్.యం.పీ, పి.యం.పి వైద్యులు పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాధ్వార్ ఆశప్ప, మక్తల్ మండల అధ్యక్షులు ఎస్.చక్రధర్, నర్వ మండల అధ్యక్షులు నర్సన్ గౌడ్, ఆర్.యం.పీలు, సూర్య ప్రకాష్ రెడ్డి, కర్ని భగవంతు, శంకర్, లక్ష్మీపతి,రఘు, సోమశేఖర్,లింగారెడ్డి,రుకియా బేగం,ఆనంద్,రవి,ఆంజనేయులు,దశరథ్, వెంకటేష్, రామకృష్ణ,గోవింద్,తాయప్ప, మోహన్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin