సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ నియోజక వర్గంలో అరాచకాలు, అక్రమాలు, అవినీతి పెరిగిపోయాయని వాటిని పారద్రోలాలంటే ఏలాంటి మచ్చలేని నాయకుడు అవినీతి అక్రమాలకు దూరంగా ఉండే నాయకుడైన బిజెపి అభ్యర్థి అందే బాబాయ్యని భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక బిజెపి యువ నాయకుడు చెట్ల వెంకటేష్ అన్నారు. తొమ్మిదవ వార్డులో బిజెపి అభ్యర్థి బాబయ్య సతీమణి అందె కిష్టమ్మ తదితరులతో కలిసి భారీ ప్రచారం చేపట్టారు. బిజెపి కేంద్ర పథకాల గురించి ప్రజలకు వివరించారు. అందె బాబయ్యను గెలిపించడం ద్వారా మంచి సుస్థిరపాలన అందుతుందని ఏలాంటి అక్రమాలు దౌర్జన్యాలు అన్యాయాలు ఉండవని అన్నారు. అందరికీ సమన్యాయం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. రాజకీయాల్లో ఎంతోకాలంగా కష్టపడి పనిచేస్తున్నారని ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదని భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ఒక బీసీ నాయకుడికి అవకాశం కల్పించిందని ప్రజలు భారీ మెజారిటీతో బాబాయ్యని గెలిపిస్తే చక్కటి పాలన ప్రజలకు అందుతుందని చెప్పారు. 9వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకులు శేరి విష్ణువర్ధన్ రెడ్డి, మల్చాలం మురళీ చెట్ల వెంకటేష్ వంశీ కృష్ణ ప్యాట అశోక్ రాము భూషణ్ కసోజు శివ అందెల సందీప్ యాదవ్ అధ్యక్షుడు సాయి కుమార్ గౌడ్ శ్రవణ్ పిట్టల యాదయ్య గణేష్ నర్సింహ వన్నడ శివ గౌడ్ మహిళలు భారీ ఎత్తున పాల్గొన్న మహిళలు కార్యకర్తలుపాల్గొన్నారు.
-----------------------
Admin