సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాష్ట్రంలో వారం రోజులుగా వర్షాలు పడుతుండడంతో మఠంపల్లి మండలంలోని చౌటపల్లి చెరువును ఎంపీడీవో జానకి రాములు, ఏపీవో ఆంజనేయులు తో కలిసి ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్ అలుగు పోస్తున్న చౌటపల్లి చెరువును పరిశీలించారు. వారు మాట్లాడుతూ వర్షాలు కురుస్తునందున, ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించడంతో ప్రజలు అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలని కోరారు. ప్రజలకు అందుబాటులో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి కవిత పాల్గొన్నారు.
-----------------------
Admin