Thursday, 30 July 2026 10:36:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రహదారులకు నిధులు మంజూరు చేయాలి... -మద్దెల

Date : 07 February 2023 02:11 AM Views : 694

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : మధిర డివిజన్లో అనేక రహదారులు గుంతల మయంగా మారాయని, రహదారుల మరమ్మతుల కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ కో. ఆర్డినేటర్, దళిత విభాగం జిల్లా అధ్యక్షులు, రిటైర్డ్ సి. ఐ డాక్టర్ మద్దెల ప్రసాదరావు డిమాండ్ చేశారు. సోమవారం నాడు మధిర మండలంలో గుంతలుమయంగా మారిన పలు రహదారులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రధాన రహదారులపై భారీ స్థాయిలో గుంతలు ఏర్పడటంతో అనేక సార్లు ప్రమాదాలు జరిగి కొందరు మృత్యువాత గురికాగా, మరికొందరు తీవ్రగాయాలతో బయట పడ్డారన్నారు. మధిర వైరా ప్రధాన రహదారిపై ఆత్కూరు సమీపంలో అడుగు లోతులో గుంతలు ఏర్పడి అనేక ప్రమాదాలు జరిగాయన్నారు. మధిర పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో భారీ స్థాయిలో గుంతలు పడ్డాయన్నారు. బోనకల్లు మండలంలో వివిధ గ్రామాలకు వెళ్ళే అనేక లింక్ రోడ్లు సైతం అధ్వానంగా ఉన్నాయన్నారు. అదే విధంగా మధిర నుండి ఇల్లూరు వెళ్ళే రహదారి ధ్వంసమైందన్నారు. అదేవిధంగా మల్లారం మీదగా నెమలి వెళ్లే రోడ్డు బోనకల్ బ్రిడ్జి పైన భారీ స్థాయిలో గుంతలు పడ్డాయన్నారు. మండలంలో రావినూతల నుండి పొద్దుటూరు వెళ్లే రహదారి, తూటికుంట్ల నుండి గొల్లపూడి వెళ్లే రహదారి సైతం అనేక సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలో అనేక రహదారులపై గుంతలు ఏర్పడటంతో ఆ రహదార్లుపై ప్రయాణం చేయాలంటే ప్రజలు, వాహనదారులు నరకయాతన పడుతున్నారని ఆయన అన్నారు. నిధులు మంజూరు చేసి రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :