సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం (నూగూరు) మెట్రో ఉదయం,ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ గా టియూడబ్లూజే(ఐజేయూ) నేషనల్ కమిటీ సభ్యులు కే శ్రీనివాస్ రెడ్డి ని తెలంగాణా ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించడం పట్ల ములుగు జిల్లా వెంకటాపురం మండలం టియూడబ్లూజే (ఐజేయూ) నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సోమవారం వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి విశ్రాంతి భవన ఆవరణలో జిల్లా జాయింట్ సెక్రటరీ జి.హరిక్రిష్ట, మండల అధ్యక్షులు వలుస రమేష్,, ప్రధాన కార్యదర్శి దాసరినారాయణరావు ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, శ్రీనివాస్ రెడ్డి నియామకం పట్ల అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా హరిక్రిష్ణ మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి హయాంలో వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు చిట్యాల చక్రి, పల్నాటి మహేష్, మన్యం భార్గవ్, సర్వేరరావు, వెంకటేశ్వర్లు, రాంకుమార్,నజీర్, ముల్తానీ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin