సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : మండల కేంద్రంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ లో వాహనదారులు గంటల తరబడి వేచి ఉన్న బంకులో బంకు యజమాన్యం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది . వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం గంటల తరబడి వేచి ఉన్న కూడా బంకు యజమాన్యం ఎవరూ కూడా సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు డీజిల్ ఎందుకు కొట్టడం లేదని అక్కడ వారిని ప్రశ్నించిన కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో వాహనదారులు విసిగి చెందుతున్నారు ఆటోలు ట్రాక్టర్లు ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది గతంలో ఇదే బంకుపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వారి ప్రవర్తన మారకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోమవారం మండల కేంద్రంలోని హెచ్పి బంకులో ఓ ఆటో డ్రైవర్ డీజిల్ కొట్టించుకోవడం కోసం గంటసేపు ఎదురుచూసిన ఎవరు రాకపోవడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది అదే సమయానికి పలు రాజకీయ నాయకులు వచ్చి ఇరువురి మధ్య సమన్వయం చేయడంతో ఆ ఘర్షణ వాతావరణం కాస్త సర్దుమణిగింది ప్రతిరోజు ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి అయినా బంకు యజమానం తీరు ఇంకెప్పుడు మారుతుందోనని పలువురు మండలంలో చర్చ నీయంగా మారింది...
-----------------------
Admin