Wednesday, 29 July 2026 05:41:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలమే నేటి మనందరి స్వేచ్చా జీవితం...

Date : 16 August 2023 03:45 AM Views : 412

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో వివిధ శాఖల కార్యాలయాలలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాంప్లెక్స్ అధికారి రఘువీర్ నామాజీ మాట్లాడుతూ.... స్వాతంత్ర దినోత్సవ గొప్పతనాన్ని , స్వాతంత్ర సమర యోధుల గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థిని, విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కాలంతో పోటీపడుతూ ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆయన అన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పాఠాలు బోధించిన ఉపాధ్యాయులకు మరియు మన కర్ని గ్రామ పాఠశాలకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన కోరారు. 405 మంది విద్యార్థిని, విద్యార్థులకు 18 మంది ఉపాధ్యాయులు ఉండవలసిన మన పాఠశాలలో 06 గురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తూన్నామన్నారు. పేరెంట్స్ మీటింగ్ ఉన్న ప్రతిసారి పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు మీటింగ్ కు తప్పక హాజరుకావాలని ఆయన సూచించారు. అనంతరం 03వ అంగన్వాడీ సెంటర్ ఉపాధ్యాయురాలు దామోళ్ల యశోద మాట్లాడుతూ... కర్ని గ్రామంలో ఇప్పటి వరకు 03 మెయిన్ అంగన్వాడీ సెంటర్లు 01 మినీ అంగన్వాడీ సెంటర్ ఉండగా.. ఒక్క సెంటర్ కు కూడా ప్రభుత్వ భవనం లేదని మా సమస్యలు దృష్టిలో పెట్టుకొని మా సెంటర్లకు ప్రభుత్వ భవనాలు నిర్మించేలా గ్రామ పంచాయతీ అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అక్రమ్, ఉపసర్పంచ్ కృష్ణయ్య గౌడ్, ఎంపీటీసీ గాసం చిన్న రంగపప్ప, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం,రిటైర్డ్ వి అర్ ఓ పురుషోత్తం రావు, మకబుల్ పాషా, సూదర్శన్ శెట్టి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :