సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గంలో నాలుగు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని శానంపూడి సైదిరెడ్డి గొప్పలు చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి హుజూర్ నగర్ నియోజకవర్ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్, వ్యాఖ్యానించారు. శనివారం హుజూర్ నగర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి మాటల్లో కనబడుతుందని, అలాగే నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కనపడుతుందని హుజూర్ నగర్ లో మాత్రం కనబడటం లేదన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు ఇప్పించలేని మీరు ఆర్భాటపు ప్రకటనలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలనుకోవడం అవివేకం అన్నారు. నాలుగున్నర సంవత్సరాలు దాటిన హుజూర్ నగర్ పట్టణంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కానీ ,ఇల్లు గాని ఇప్పించలేకపోయారని విమర్శించారు. రోడ్ల వెడల్పులో నిర్వాసితులైనటువంటి నిరుపేదల ను ఆదుకోకుండా వారిని బజారుపాలన చేశారని విమర్శించారు. పాత బస్టాండ్ నుంచి అడ్డరోడ్డు వరకు ప్రధాన రహదారి గుంతలమయమై వానొస్తే మోకాళ్ళ లోతు నీళ్లతో వాహనదారులు , వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. లిక్కర్ మాఫియా , ల్యాండ్ మాఫియా , సాండ్ మాఫియా , బెల్టు షాపులలోనే హుజూర్ నగర్ అభివృద్ధి చెందిందే తప్ప ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి పలాలు అందుకోలేకపోతున్నారని అన్నారు. నియోజకవర్గం ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ పార్టీ అధ్యక్షులు కొమ్మ గాని వెంకటేశ్వర్లు గౌడ్ ,గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు కేసరి నాగయ్య ముదిరాజ్ , హుజూర్ నగర్ ,గరిడేపల్లి మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు మీసాల సైదులు ,గుండు వెంకటేశ్వర్లు గౌడ్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు చంద్రగిరి సాంబ, వల్లపు దాసు కోటయ్య గౌడ్ ,చింతలచెరువు శేఖర్ ,రాంబాబుతదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin