సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ టౌన్ హాల్ నందు అమరవీరుడు సోమ గాని భరత్ పదో వర్ధంతి సందర్భంగా హుజూర్ నగర్ పుర ప్రముఖులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అమరవీరుడు నందిగామ అంజయ్యకు కూడా నివాళులర్పించారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం ను నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక తెలంగాణ వస్తే తెలంగాణ లో చదువు కున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకంగా అమరవీరులైన అమరవీరుల త్యాగాలను నేటికైనా గుర్తించి నిరుద్యోగుల కు ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే వారికి నిజమైన నివాళులర్పించినట్లని అప్పుడే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. భరత్ చదువుకుంటూనే తాను కూడా కరెంటు పని చేసుకుంటూ కుటుంబ పోషణ తో పాటు ఉన్నత విద్యను అభ్యసించేవాడని భవన నిర్మాణ కార్మిక సంఘం లో ఒకడిగా ఉండేవాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిండిప్రోలు కోటేశ్వరరావు,సోమగాని నరసింహ, కృష్ణ, గుండు వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin