సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : నవంబర్ 4న హైదరాబాదు జలవిహార్ లో జరిగే తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో అధిక సంఖ్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన న్యాయవాదులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా బిఆర్ఎస్ లీగల్ సెల్ భద్రాద్రి జిల్లా బాధ్యులు పిలుపునిచ్చారు. బుధవారం కొత్తగూడెం కోర్టు ప్రాంగణంలో రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం నకు సంబంధించిన గోడపత్రికనువిష్కరించారు. నవంబర్ 4వ తేదీన, జలవిహార్ లో జరిగే న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బోయినపల్లి వినోద్ కుమార్,అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తదితర ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షులు దుండ్రా రమేష్ న్యాయవాదులు పలివెల గణేష్ బాబు, గాజుల రామ్మూర్తి,జంగాల పద్మనాభరావు, బి.చిరంజీవి రావు, శెట్టిపల్లి వెంకట రామారావు , మల్లెల ఉషారాణి, గుమ్మడి శాంత, రాచకట్ల సుజాత, జీ.శిరీష, వేముల మధుకర్, మహమ్మద్ అబ్దుల్ రఫిక్, కే.శ్రీధర్ , పల్నాటి రమణ, శ్రీరాముల రవి, ఎన్. శ్వేత, పిరూప,లక్కినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin