సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆదివారం నుండి పర్యటన ప్రారంభించారు. సుజాతనగర్ మండలం పలు గ్రామాలలో పర్యటించారు. మంగళవారం పాల్వంచలోని వార్డులలో పర్యటించి ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. వార్డులోనే సమస్యలు పాల్వంచ పట్టణంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ముఖ్య నాయకులు మాట్లాడుతూ మీరు లేని లోటు కొత్తగూడెం ప్రజానీకానికి తెల్సొచ్చిందని మీరు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఏమీ మార్పు లేదని కొత్తగూడెం నియోజకవర్గం నాలుగు సంవత్సరాలు వెనుకబడిపోయిందని అన్నారు. స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన దానికి కారణం ప్రజలకు తెలుసు అని రాబోయే రోజుల్లో వారికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.
-----------------------
Admin