సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం నారప్ప గారి పల్లి వద్ద సోమావతి నది ఒడ్డున వెలసిన మల్లూరు అమ్మ వారు జాతర ఘనంగా జరిగింది. అమ్మవారు దర్శించుకోవడానికి కర్ణాటక ,అనంతపురం, కడప అనేక ప్రాంతాలు నుంచి తరలివచ్చిన భక్తులుఎన్నడూ లేని విధంగా వేలాది మంది భక్తులు మల్లూరు అమ్మవారు జాతరకు తరలివచ్చారు . ఓబుల దేవర చెరువుమండలంలో నారప్ప గారి పల్లి వద్ద సోమావతి నది వద్ద వెలసిన మల్లూరు అమ్మవారు జాతరకు ముఖ్య అతిధిగా పుట్టపర్తి శాసనసభ్యులు దుద్ది కుంట శ్రీధర్ రెడ్డి హాజరై అమ్మవారు కి ప్రత్యేక పూజలు నిర్వహించి,నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా , ఆనందంగా అష్ట ఆరోగ్యంగా వుండాలని అమ్మవారిని కోరుకున్న పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి . ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వీన్ భాను, కోళ్ల కృష్ణారెడ్డి , లక్ష్మారెడ్డి, జడ్పిటిసి దామోదర్ రెడ్డి, వైయస్సార్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు తుమ్మల షామీర్ భాష, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా , ఓ డి సి గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎం. ఆరిఫ్ ఖాన్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin