సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మద్యం మత్తులో తోటి కార్మికుడు పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చుంచుపల్లి మండలంలో చోటుచేసుకుంది.... రామవరం ప్రాంతానికి చెందిన మందగడుపు ఖాళీకిరణ్, ఎస్కే రఫీ మణుగూరు ప్రాంతంలో సింగరేణి ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గత పది రోజుల నుండి ఉద్యోగానికి ఎగనామం పెట్టి మద్యం సేవిస్తూ ఇద్దరు వ్యక్తులు జులాయిగా తిరుగుతున్నారు. సాయంత్రం సమయంలో విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్ లో గల బెల్ట్ షాపు వద్ద కిరణ్, రఫీ ,నవీన్ మద్యం సేవిస్తూ గొడవపడ్డారు. మద్యం మత్తులో ఉన్న రఫీ విచక్షణ కోల్పోయి తన స్నేహితుడి అయినా ఖాళీ కిరణ్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చుంచుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని వైద్యం నిమిత్తం కొత్తగూడెం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రఫీని పోలీసులు అదుపులోకి తీసుకొనగా నవీన్ పరారీ లో ఉన్నాడు. దాడికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
-----------------------
Admin