సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలోని ఎమ్ ఎల్ సి అభ్యర్థుల ఎన్నికల ప్రచార భాగంలో పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి ఓబులదేవర చెరువు మండలంలోని పలు పంచాయతీలో తంగేడుకుంట, గౌనిపల్లి, ఓ డి సి సచివాలయం, ప్రభుత్వ పాఠశాల ఉన్నత పాఠశాల, విజ్ఞాన్ హై స్కూల్, మిట్టపల్లి హై స్కూళ్లను పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వ, ప్రవైట్ ఉపాధ్యాయులు, డిగ్రీ పట్టభద్రులు పక్శిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్ ఎల్ సి అభ్యర్థులను అత్యధిక ఓట్లతో గెలిపించాలని అభ్యర్థించారు. మండల వ్యాప్తంగా పంచాయతీల వారీగా వున్న అల్లా పల్లి -103,చింతామణి పల్లి - 43, డబురవారి పల్లి - 62,ఇనగళూరు - 79,కొండకమర్ల - 214, టి కుంట్లపల్లి -41, మిట్ట పల్లి -37, ఓడిసి - 211, సున్నం పల్లి - 51,తంగేడుకుంట - 66, తిప్పే పల్లి - 35, వెంకటాపురం - 26 ఓటర్ల వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంపీపీ తుమ్మల పర్వీన్ బానూ, జెడ్పిటిసి కుర్లి దామోదర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు తుమ్మల షామీర్ బాషా, మండల కన్వీనర్ రాజూ నాయుడు, టౌన్ కన్వీనర్ కోళ్ల కృష్ణారెడ్డి,నల్లమాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల అగ్రి అడ్వాయిజరీ బోర్డు చైర్మన్ లక్ష్మి రెడ్డి, విజ్ఞాన్ స్కూల్ అధినేత బాబా ఫకృద్దిన్, సర్పంచ్ గోవింద్, అబిదా బానూ, జగన్మోహన్ చౌదరి, రామచంద్రా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల బాబా, ఓడిసి గ్రామ కమిటీ అధ్యక్షులు మండోజీ ఆరిఫ్ ఖాన్, నాయకులు జవుళి బాబా, బాబ్ జాన్, బైరి శెట్టి,భారతి సిమెంట్ రఫీ, మాల్లూరి బయపరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు....
-----------------------
Admin