సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోకవర్గంలోని నందిపేట్ మండలంలోని మాయాపూర్ బాద్దున,ఉమ్మేడ గ్రామాలలో బిజెపి పార్టీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. వినయ్ కుమార్ రెడ్డి జీవన్ రెడ్డి మధ్య ఒప్పందం ఉందని పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వాగతం పలికారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రైస్ కుక్కర్ లకు మాంసం కూర కు ఓట్లు వెయ్యొద్దు అని రైస్ కుక్కర్లు నకిలీవి అని జాగ్రత్త ఉండాలని జీవ రెడ్డి వినయ్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆయన చెప్పారు. సామాన్యులు ప్రభుత్వానికి బకాయి ఉంటే నేరం చేసినట్లు అధికారులు ప్రవర్తిస్తారు అని ఎమ్మెల్యే కోట్ల రూపాయలు ఆర్టీసీకి బాగా ఉన్న పట్టించుకోవడం లేదు అని వినయ్ రెడ్డి కి ఓటు వేసిన జీవన్ రెడ్డికి ఓటు వేసినట్లు అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మళ్లీ మోసపోవద్దు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రతి గ్రామంలో ఇండ్ల నిర్మాణం చేస్తామని ఇంట్లో ఇద్దరికీ పెన్షన్లు ఒక్క గింజ తరుగు లేకుండా వడ్లు బిజెపి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. మాజీ సర్పంచ్ రావుల సురేష్ మాజీ ఉపసర్పంచ్ సాయి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి బిజెపి పార్టీలో చేరారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు సాయి రెడ్డి,శివ, కొండూరు ఎంపిటిసి రాజు, సతీష్, ముత్యం, ఆయా గ్రామాల ప్రజలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin