సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం లోని యువతీ యువకులకు బిజెపి సీనియర్ నేత పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. లైసెన్స్ లేని యువతీ యువకులకు సుమారు 12,000 మందికి ఉచితంగా లైసెన్సు సౌకర్యం కల్పిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఎంతోమంది యువతీ యువకులు లైసెన్స్ లేకుండా ఉంటున్నారని వారిని గుర్తించి వారికి పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచితంగా లైసెన్స్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. యువతీ, యువకులు తమ ఎసెస్సి మెమో, ఆధార్ కార్డు ఇతరత్రాపత్రాలను చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో అందజేయాలని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ సమస్యల విషయంలో ఆగస్టు మూడో తేదీ నుండి పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ అంశంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో సంప్రదించి పాదయాత్ర ప్రణాళికను రూపొందిస్తానని అన్నారు. ఈ మీడియా సమావేశంలో స్థానిక బిజెపి నాయకులు విజయభాస్కర్, నరసింహ, పట్టణ అధ్యక్షుడు ఋషికేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin