సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలోని తోపారం మధుప్రియ (24) డెంగ్యూ జ్వరంతో గురువారం మృతి చెందింది. తీవ్ర జ్వరం రావడంతో హుటా హుటిన జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లగా వైద్య పరీక్షల నిమిత్తం డెంగ్యూ జ్వరం అని డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లని బంధువులు తెలిపారు... బాల్కొండ ను వనికిస్తున్న డెంగ్యూ... డెంగీ మండల కేంద్రాన్ని వణికిస్తుంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 20 మంది మండల కేంద్ర వాసులు చికిత్సపొందుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మండల కేంద్రంలో సుమారు వంద మంది డెంగీతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికా రులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-----------------------
Admin