సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఎసిఎస్) నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం ఏకాగ్రీవంగా ఎన్నిక చేయగా శనివారం రోజున సొసైటీ చైర్మన్ గా రిటైర్డ్ ఏఎస్ఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల కుమారస్వామి గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టారు.12 మంది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ తో పాటు 13 మంది పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టారు. సొసైటీ డైరెక్టర్లుగా కోరికల ప్రశాంత్, జంగిలి రవి, బొల్లంపల్లి నరసయ్య, భూతం కుమారస్వామి, పిండి అశోక్, తొర్రూర్ రామన్న, కొలగాని రవి, నాగూర్ల సునీత, కూరతోట శ్రవణ్, తోకల మధుకర్ రెడ్డి, మామిడిపల్లి భాగ్య, మానుపాటి సారమ్మ, బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ ముత్యాల కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని రైతులకు మెరుగైన సేవలను అందించడమే తమ లక్ష్యమని అన్నారు. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో సొసైటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మందపల్లి సొసైటీ చైర్మన్ తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్, ఇతర నాయకులకు చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందపల్లి సొసైటీ చైర్మన్ తోకల శ్రీనివాస్ రెడ్డి, మహ్మదాపురం సొసైటీ చైర్మన్ ఇంగోలి రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు, సీఈవో ఆరెల్లి బిక్షపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ హింగే రామారావు, మాజీ ఎంపీపీ బూర్గు రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు శివాజీ, కూరతోట సురేష్, తొర్రూర్ రవి, అసోలా సురేష్ వివిధ గ్రామాల సర్పంచులు జంగిలి రాజు, ఉత్తరేణి భాగ్యలక్ష్మి రాజబాబు, కూరతోట స్వప్న సురేష్, వేముల ఇంద్రదేవ్, నాయకులు కార్యకర్తలు సొసైటీ పరిధిలోని రైతులు పాల్గొన్నారు
-----------------------
Reporter