Wednesday, 29 July 2026 12:59:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దుగ్గొండి సొసైటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న రిటైర్డ్ ఏఎస్ఐ ముత్యాల కుమారస్వామి గౌడ్

Date : 05 July 2026 12:57 PM Views : 109

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఎసిఎస్) నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం ఏకాగ్రీవంగా ఎన్నిక చేయగా శనివారం రోజున సొసైటీ చైర్మన్ గా రిటైర్డ్ ఏఎస్ఐ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల కుమారస్వామి గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టారు.12 మంది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ తో పాటు 13 మంది పాలకవర్గ సభ్యులు కూడా బాధ్యతలు చేపట్టారు. సొసైటీ డైరెక్టర్లుగా కోరికల ప్రశాంత్, జంగిలి రవి, బొల్లంపల్లి నరసయ్య, భూతం కుమారస్వామి, పిండి అశోక్, తొర్రూర్ రామన్న, కొలగాని రవి, నాగూర్ల సునీత, కూరతోట శ్రవణ్, తోకల మధుకర్ రెడ్డి, మామిడిపల్లి భాగ్య, మానుపాటి సారమ్మ, బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ ముత్యాల కుమారస్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని రైతులకు మెరుగైన సేవలను అందించడమే తమ లక్ష్యమని అన్నారు. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో సొసైటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మందపల్లి సొసైటీ చైర్మన్ తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్, ఇతర నాయకులకు చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందపల్లి సొసైటీ చైర్మన్ తోకల శ్రీనివాస్ రెడ్డి, మహ్మదాపురం సొసైటీ చైర్మన్ ఇంగోలి రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్క రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నర్సింగరావు, సీఈవో ఆరెల్లి బిక్షపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ హింగే రామారావు, మాజీ ఎంపీపీ బూర్గు రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు శివాజీ, కూరతోట సురేష్, తొర్రూర్ రవి, అసోలా సురేష్ వివిధ గ్రామాల సర్పంచులు జంగిలి రాజు, ఉత్తరేణి భాగ్యలక్ష్మి రాజబాబు, కూరతోట స్వప్న సురేష్, వేముల ఇంద్రదేవ్, నాయకులు కార్యకర్తలు సొసైటీ పరిధిలోని రైతులు పాల్గొన్నారు

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :