సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : పాల్వంచ మండలం లోని ఆశ్రమ పాఠశాల నందు జాతీయ నులిపురుగుల కార్యక్రమమును నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ JVLశిరీష గారు ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారిని గారు మాట్లాడుతూ..... 1 నుండి 19 సంవత్సరంలోపు పిల్లలందరికీ సంవత్సరములో రెండుసార్లు ఆల్బెండజోల్ టాబ్లెట్లు తప్పనిసరిగా వేయించవలెనని తెలియజేశారు. ఈ మాత్రలు వేయడం వలన పిల్లల్లో నులిపురుగుల వలన వచ్చే రక్తహీనత, మరియు పోషకాహార లోపం వంటి వ్యాధులను అరికట్టవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరు చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొనవలెను. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించవలెను అని తెలియజేశారు. జిల్లాలో3,36,136 లక్ష్యానికి3,19,340 మంది పిల్లలకు ఆల్బెండజోళ్ మాత్రలు వేయడం జరిగినది. ఈరోజు 95% పిల్లలకు పంపిణీ చేయడం జరిగినది. మిగిలిపోయిన పిల్లలకు Mop up round లో భాగంగా ఆగస్టు 10వ తారీఖున పంపిణీ చేయడం జరుగుతున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కొత్త గూడెం డాక్టర్ సుకృత చైల్డ్ ఇమినైజేషన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బాలాజీ ,ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ పర్షియా నాయక్, డాక్టర్ మణికంఠ రెడ్డి, డాక్టర్ స్పందన, సిహెచ్ఓ నాగభూషణం, యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్రాజశేఖర్ ,విద్యాశాఖ ప్రతినిధులు సైదులు, నాగరాజ్ శేఖర్ మరియు యూపీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగినది.
-----------------------
Admin