సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్ల చెరువు : సింహం గుర్తు జోరుకి ప్రధాన పార్టీలన్నీ బేజారు... మేళ్ల చెరువు మండలంలో సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘుకు ప్రజలు ఘన స్వాగతం పలికినారు.ప్రతి అడుగు రఘు అన్న తోనే అంటూ, అడుగులో అడుగులు వేస్తూ సింహం గుర్తుకే మా ఓటు అంటున్న మేళ్ల చెరువు మండల వాసులు. గడప గడపకు రఘున్న భరోసా యాత్ర చేస్తున్న ప్రజలు,మహిళ లు పెద్దలు, యువకులు తమ ఓటు సింహం గుర్తు కే వేసి పిల్లుట్ల రఘున్న ఎమ్మెల్యేగా గెలిపించు కుంటామన్నారు.ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ సందర్భంగా మూడు సంవత్సరాల కాలంలో ఆరు లక్షల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఘనత పిల్లుట్ల రఘుకు చెందుతుందని వారు అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1500 మంది విద్యార్థులకు ఉచితంగా సొంత ఖర్చులతో హైదరాబాదు నందు ప్రయాణం,కోచింగ్, భోజన వసతి కల్పించిన ఘనత పిల్లుట్ల రఘు దే అని అన్నారు.మేళ్ల చెరువు లో ఆంజనేయ స్వామి విగ్రహంకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రంగులు వేయించిన ఘనత, మండలంలోని అనేక పాఠశాలలు బాగు చేపించి, దేవాలయాలను అధునికరించి బొడ్రాయిలు, విగ్ర ప్రతిష్టలు, అన్నదానాలు సొంతంగా నిర్మించిన ఘనత పిల్లుట్ల రఘు కి చెందుతుందని ప్రజలు అన్నారు. అధికారంలో ఉన్న నాయకులు చేయలేని పనులు కూడా చిరునవ్వుతో, గొప్ప పనులు చేశాడని ప్రజలు అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి, మీ బతుకులు మార్చుతా అని,మండల పరిధిలో ఎన్నో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి అయినా మన యువతకి ఉద్యోగాలు రాకుండా, సొంత పనులపై ఆధారపడి రోజు వారి కూలీలుగా మార్చి పనులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు మార్చటానికి వచ్చిన వ్యక్తిని నేను అని ఒక్క అవకాశం ఇవ్వండి మేళ్లచెరువు మండలంతో పాటు నియోజకవర్గాన్ని అభివృధి చేస్తా అని పిల్లుట్ల రఘు అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో రఘున్న అభిమానులు, సింహం గుర్తు ప్రచార మండలాల నాయకులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin