సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అనుచరులుగా పేరుబడిన వారు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ లో లాంచనంగా చేరారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా వారు టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో వీర్లపల్లి సుధాకర్ గౌడ్, అన్వర్, సాజిద్, మొగిలిగిద్ద గుట్ట రాజు, గాలిగూడెం జగదీష్ తదితరులు పార్టీలో చేరినట్టు ఎమ్మెల్యే అంజయ్య ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో సేవలందించిన సదరు నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో పలువురు కంగుతిన్నారు. వీర్లపల్లి శంకర్ అనుచరులుగా పేరుబడిన సదర నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు..
-----------------------
Admin