సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి:మండలం గడ్డిపల్లి గ్రామంలో గల విత్తన తయారీ కేంద్రాలపై వ్యవసాయ శాఖ,పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా కలిసి దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో భాగంగా గడ్డిపల్లిలోని 8 విత్తన తయారీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహించారు.విత్తన తయారీ కేంద్రాలలో ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన వరి విత్తనాలే కాకుండా తక్కువ నాణ్యత కలిగిన సర్టిఫైడ్ చేయని విత్తనాలను అధికారులు గుర్తించి వాటికి సంబంధించిన 7 దుకాణాలను సీజ్ చేశారు. నకిలి విత్తనాలు అమ్ముతున్న షాప్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు గరిడేపల్లి ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. అలాగే సీజ్ చేసిన విత్తన బస్తాలను ల్యాబ్ కు పంపించామని తెలిపారు.ఇలా నాణ్యతలేని విత్తనాలు అమ్మే దుకాణాలపై చట్టపరమైన కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.ఈ దాడులలో వ్యవసాయ శాఖ ఏడి రామారావు నాయక్,సంధ్యారాణి, హుజూర్నగర్ సిఐ రామలింగారెడ్డి, గరిడేపల్లి ఏవో ప్రీతం కుమార్,ఏఈఓలు పాల్గొన్నారు.
-----------------------
Admin