సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం మండలం అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నాయి. పలు గ్రామాలలో కిరాణా దుకాణంలో ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులు అమ్ముతూ కిరాణం షాపు ముసుగులో మద్యం సీసాలు అమ్ముతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మద్యం లభించడంతో వినియోగదారులు జేబులు ఖాళీ చేసుకొని అనారోగ్యం భారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత 24 గంటలు బెల్ట్ షాపులు తెరిచి ఉండటంతో జల్సాలకు అలవాటు పడి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు మంచినీళ్లు దొరకని ఊళ్లు ఉంటాయేమో గాని మద్యం దొరకని గ్రామాలు లేవు అని తెలంగాణలో ఓ సామెత ఉంది. తాగినోళ్లకు తాగినంత బూర్గంపహాడ్ మండలంలో మద్యం దొరుకుతుంది.. ఏ బ్రాండ్లు కావాలన్నా. మద్యం షాపుల్లో దొరకకపోవచ్చు కాని బెల్ట్ షాపుల్లో ఇట్టే దొరికిపోతుంది. ఏ ఊరెళ్లినా పొద్దు మావు తేడా లేకుండా బెల్టు షాపులు పుట్ట గొడుగుల్లెక్క వెలుస్తున్నాయ్. ఇదీ జగమెరిగిన సత్యం.. బూర్గంపహాడ్ మండలంలోని వివిధ గ్రామాలలో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుంది. గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపులు తెల్లవారుజామున నుంచి అర్ధరాత్రి వరకు సమయం ఎంతైనా. మద్యం దొరుకును అనే తరహాలో అందుబాటులో ఉంటున్నాయి. మండల పరిధిలో గ్రామాలు ఉండగా పలు గ్రామాల మినహా మిగిలిన అన్ని గ్రామాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నట్లు సమాచారం. పగలు రాత్రి అనే తేడా లేకుండా బెల్టు షాపు యజమానుదారులు స్థానికంగా ఉన్న వైన్స్ దుకాణాల నుండి కొనుగోలు చేసిన మద్యాన్ని అతి చిన్న వయను పిల్లలకు పోస్తూన్నారు. రోజు రోజుకు గ్రామాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కోన సాగుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు తెరిచి మండల పరిధిలోని బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని అలాగే బెల్ట్ షాపుల యజమానులకు మేము అండగా ఉన్నామంటూ బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న సిండికేట్ వ్యాపారులపై కూడా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు వేడుకుంటున్నారు...
-----------------------
Admin