సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ఫౌండర్ భీమపంగు విజయ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణానికి పునాది వేసి బడుగు బలహీన అణగారిన వర్గాలలో చైతన్యం నింపాలని సాంఘిక రాజకీయ వర్గాలలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశాడని ఏ ఒక్క వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకుండా అన్ని వర్గాలను సమ భావంతో రాజ్యాంగ నిర్మాణం చేసి ప్రజల మనిషిగా నిలిచాడని ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరు నడుము కట్టి ముందుకు సాగాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో భీమపంగు విజయ, బత్తిని సుగుణ, ఊటుకూరు రాణి ,పిట్టల నాగమణి, చిట్టి ప్రోలు పద్మ, నారా వరపు సుహాసిని, పిట్టల జ్యోతి, ముల్కలపల్లి పద్మ తదితరులుపాల్గొన్నారు...
-----------------------
Admin