సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మండలం : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతో యువత బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని హుజూర్ నగర్ బీజేపీ పార్టీ నాయకురాలు చల్ల శ్రీలత రెడ్డి అన్నారు... నేరేడుచర్ల బిజెపి పార్టీ కార్యాలయంలో చల్ల శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో మఠంపల్లి మండలం వర్థపురం గ్రామానికి చెందిన, ఉస్సెన్,ఉయ్యాల రాజు,శ్రీను,నరేందర్, రామాంజి రాజేష్, వినోద్,ముజాయిద్, నాగరాజు,సురేందర్ తదితరులను బీజేపీలో కాషాయ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి బీజేపీతో సాధ్యమని, రాబోయే రోజులలో మరింత మంది భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజల సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్నగర్ గడ్డపై కాషాయ జెండాను ఎగరవేయడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ, మండల అధ్యక్షులు సంకలమద్ది సత్య నారాయణ రెడ్డి,పార్దనబోయిన విజయ్ కుమార్,రాష్ట్ర కమిటీ సభ్యులు బాల వెంకటేశ్వర్లు,బిజెపి నాయకులు పాల్గొన్నారు..
-----------------------
Admin