సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం లోని నల్లగుట్ట పల్లి గ్రామానికి చెందిన ఆర్ సత్యనారాయణ నాయక్ ఆర్ లక్ష్మీదేవి ల కుమార్తె ఆర్ సౌజన్య బాయి "నేషనల్ ఎలిజిబులిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్( నీట్) "లో రాణించింది. బుధవారం విడుదలైన నీ ట్ ఎంట్ర న్స్ పరీక్షల్లో 7 20 మార్కులు గాను 397 మార్కులు సాధించింది. ఎస్టీ కేటగిరి కింద 4180 ర్యాంక్ పొందింది. విద్యార్థిని తల్లిదండ్రులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉంటూ సౌజన్య బాయి ను చదివిస్తూ వస్తున్నారు. సందర్భంగా సౌజన్య బాయి మాట్లాడుతూ ..తమది పేద కుటుంబం..పేదలకు ఉచితంగా వైద్య సేవలు చేయడమే తమ లక్ష్యం అన్నారు. 1వతరగతి నుండి పదవ తరగతి వరకు మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠ శాలలో విద్యాభ్యాసం చేసినట్లు ఆ విద్యార్థిని పేర్కొన్నారు. తాను శ్రీ చైతన్య కోచింగ్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నట్లు ఆ విద్యార్థిని తెలిపారు.
-----------------------
Admin