సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : బుక్కపట్నం మండలం లోని శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులతో పర్యావరణం పై అవగాహన సదస్సు.ఐ హే ఆర్ సి సభ్యులు డాక్టర్ భాస్కర్ నాయుడు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు.డాక్టర్ భాస్కర్ నాయుడు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యుల పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ లక్ష్మయ్య ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ చంద్ర, భాస్కర్ నాయుడులు మాట్లాడుతూ పర్యావరణాన్ని మనం అందరం రక్షిస్తే అది కూడా మనల్ని రక్షిస్తుందని గాలి, నీరు, ఆహారం, సూర్యరశ్మి, మొక్కలు మనకు ప్రకృతి అందించినట్లే మానవాళికూడా మొక్కల్ని విరివిగా పెంచి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉన్నదని, వృక్షో రక్షిత రక్షతః అను నానుడి కట్టుబడి ఉండాలని తెలియజేసారు. కరువు జిల్లాలో ప్రతి మొక్క మహావృక్షమే కనుక వాటిని కాపాడాలి.ప్రకృతి నుండే అన్ని జీవరాసులకు అవసరమైన ఆహార పానీయాలు అందుతాయని అటువంటి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని తెలియజేసారు. యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి విషయాలపై కూలంకుషంగా తెలియజేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రతి సంవత్సరం వందల కోట్ల నిధులు పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయిస్తున్నా సద్వినియోగం కాలేదని అలాగే లక్షల ఎకరాలలో అడవులు కాలిపోతున్నాయని .దేశంలో రెండవ కరువు జిల్లా నుండి పక్క రాష్ట్రాలకు అక్రమ కలప ఎగుమతిని అరికట్టాలని అందుకోసం విద్యార్థులను సైతం హ్యూమన్ రైట్స్ లో భాగస్వామ్యం చేయడానికి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయటానికి తగిన ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు జిల్లాలో అత్యంత ముఖ్యమైన బుక్కపట్నం ఫారెస్ట్ రక్షించడానికి మా వంతు కృషి చేస్తాం అని చెట్టు విలువ కోటి రూపాయలుగా పక్క రాష్ట్రం బెంగాల్ నిర్ణయించిన మేరకు. విద్యార్థులు సైతం శక్తి మేరకు వందల సంఖ్యలో చెట్లను రక్షించి ,నాటించి వందల కోట్ల రూపాయలు సంపాదను ఈ సమాజానికి మేము సైతం అందించి బాధ్యతగా ఉండగలమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ సభ్యులు లింగమయ్య అధ్యాపకులు ఓబయ్య చంద్రమోహన్, ఆనంద్ నాగేంద్ర వెంకటేష్ ప్రసాద్, వినయ్ బోధనేతర సిబ్బంది మరియు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin